లోకేష్ పై ఓ రేంజ్ లో ఫైరయ్యారు ఏపీ మంత్రి అనిల్. లోకేష్ కి ఫ్రస్టేషన్ పీక్స్ లో ఉందని..ఎమ్మెల్యేగా గెలవలేక పోయినా ముఖ్యమంత్రిని తిట్టి పెద్ద నాయకుడిని అయిపోయానని ఫీలవుతున్నాడు అన్నారు. డిపాజిట్ కూడా తెచ్చుకోలేని లోకేష్ కు జగన్ గురించి మాట్లాడే స్థాయి ఉందా అన్నారు. దేశ ప్రజలు ఇప్పటికే పప్పు నాయుడు అని పేరు పెట్టారు అని అది మేము చెప్పట్లేదని ఇంటర్నెట్ లో లోకేశ్ అని సెర్చ్ చేస్తే గూగుల్ చెబుతుందన్నారు. జగన్ అమూల్ బేబీ అయితే..లోకేష్ హెరిటేజ్ దున్నపోతా అన్నారు. ఆ భాష మాకు కూడా వచ్చు నాయకత్వ లక్షణాలు రక్తంలో ఉంటాయి..నోటికి వచ్చినట్లు మాట్లాడం సరి కాదు అన్నారు.

కరోనా కాలంలోనూ పోలవరం పనులు ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాం అన్నారు ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్. వైఎస్ బీజం వేసిన ప్రాజెక్టును ఆయన తనయుడు జగన్ పూర్తి చేస్తుంటే టీడీపీ నాయకులు చూడలేక పోతున్నారు అన్నారు. ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ఫైరయ్యారు అనిల్.