భారత జాతిపిత మహత్మాగాంధీ మునుమనమరాలికి జైలు శిక్ష విధించింది సౌత్ ఆఫ్రికాలోని డర్భన్ కోర్టు. వ్యాపార వేత్తని మోసం చేసిన కేసులో ఆశిష్ లతా రామ్గోబిన్కు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వ్యాపార లావాదేవీల్లో భాగాంగా సౌత్ ఆఫ్రికాకి చెందిన వ్యాపార వేత్త ఎస్. మహారాజ నుంచి రూ.3.3 కోట్లు తీసుకున్నా అశిష్ లతా ఈ డబ్బులకు సంభందించిన ట్యాక్స్ సరైన విధంగా చెల్లించలేదని అలాగే వ్యాపారంలో తన వాటా ఇవ్వలేదంటూ ఫిర్యాదు చేశారు మహరాజ.

ఈ కేసును విచారించిన డర్భన్ కోర్టు 56 ఏళ్ల ఆశిష్ లతా రామ్గోబిన్ను తప్పు చేసినట్లు నిర్దారించింది. దీంతో ఆమెకు దర్బాన్ క్రైమ్ ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. కాగా ఆశిష్ లతా రామ్ గోబిన్ మహాత్మాగాంధీ కుమారుడు మేవా రామ్ గోబిన్ కుమార్తె.